ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిడ్డ కళ్ల ముందే తల్లి మృతి.. సీసీటీవీ వీడియో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 08:03 PM

బిడ్డ కళ్ల ముందే తల్లి ప్రాణాలు విడిచింది. తన బిడ్డకు ఏ కష్టం రావొద్దని దేవుడికి మొక్కు చెల్లించుకొని, తిరిగొస్తూ.. అరగంటలో ఇల్లు చేరతామనగా మృత్యువు కబళించింది. కుటుంబసభ్యుల కళ్ల ముందే దుర్మరణం పాలైంది. హైదరాబాద్‌లో డబీర్‌పురాకు చెందిన అమిత్‌కరణ్‌ సివిల్‌ కాంట్రాక్టర్‌‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కృతిక (30), కుమారుడు మాధవ్‌ (3) ఉన్నారు. కృతిక తమ కుమారుడి ఆరోగ్యం కోసం మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ భవానీమాతకు మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు అమిత్‌కరణ్‌ తన తల్లిదండ్రులు, భార్య, కుమారుడితో కలిసి జూన్ 21న మహారాష్ట్రకు వెళ్లారు. ఆదివారం దర్శనం పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా.. సోమవారం ఉదయం కూకట్‌పల్లి మెట్రోపిల్లర్‌ 761 వద్దకు రాగానే కారు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. రోడ్డుకు ఓ వైపున ఆగిపోయిన కారు నుంచి కృతిక తన కుమారుడిని ఎత్తుకొని కిందకు దిగింది. ఇదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన బొలేరో వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి కృతిక, ఆమె కుమారుడు దూరంగా పడ్డారు. తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa