కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం డివిజన్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ నగర్ - ఎ కాలనీవాసుల దీర్ఘకాల సమస్యలను పరిష్కరించే దిశగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కీలక చర్యలు చేపట్టారు. కాలనీవాసుల విన్నపం మేరకు గణేష్ టెంపుల్ నుండి చిల్లా వరకు, శ్రీను ఇంటి నుండి చిల్లా వరకు, ట్రాన్స్ఫార్మర్ నుండి చంద్రగిరి బార్డర్ వరకు సీసీ రోడ్ల నిర్మాణానికి 38 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన బస్తీలను సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ పర్యటనలో కూన శ్రీశైలం గౌడ్ స్థానికులతో సమస్యల గురించి చర్చించి, వారి అవసరాలను అర్థం చేసుకున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం వల్ల కాలనీవాసులకు రాకపోకలు సులభతరం కానున్నాయని, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. స్థానికులు ఈ పనులను సత్వరగతిన పూర్తి చేయాలని కోరారు, దీనిపై మాజీ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.
బస్తీవాసులు తమ సమస్యలను విన్నవించిన వెంటనే చర్యలు తీసుకుని, సీసీ రోడ్ల సాంక్షన్కు కృషి చేసిన కూన శ్రీశైలం గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నాయకత్వంలో గతంలో కూడా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఈ కొత్త ప్రాజెక్ట్తో మరింత పురోగతి సాధ్యమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. కూన శ్రీశైలం గౌడ్ స్థానిక సమస్యల పట్ల చూపిన చొరవ మరియు అంకితభావం స్థానికుల్లో సానుకూల స్పందనను రేకెత్తించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa