జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల పరిధిలో శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ‘పల్లెబాట’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోడోనికుట్ట తండా, గిర్నితండాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న పథకాలు, వాటి ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను హైలైట్ చేశారు.
గడపగడప తిరుగుతూ, గ్రామస్థులతో సమావేశమైన ఝాన్సీ రెడ్డి, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల మౌలిక అవసరాలను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా సంపర్కం ఏర్పరచుకోవడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేందుకు ఝాన్సీ రెడ్డి కృషి చేశారు. ఈ ‘పల్లెబాట’ కార్యక్రమం ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa