చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామ సమీపంలో శనివారం ఫామ్ ఆయిల్ మెగా ప్లాంటేషన్ తోటను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, చేవెళ్ల శాసనసభ్యులు యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పామ్ ఆయిల్ పంటల ప్రాముఖ్యతను మంత్రి తుమ్మల వివరించారు. ఈ పంటలు రైతులకు అధిక ఆదాయాన్ని అందించడంతో పాటు, వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఆయన తెలిపారు.
పామ్ ఆయిల్ పంటలు తక్కువ నీటితోనూ, సరైన నిర్వహణతో అధిక దిగుబడిని ఇస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఈ పంటలు వాణిజ్యపరంగా లాభదాయకమైనవని, దీర్ఘకాలంలో రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాక, పామ్ ఆయిల్ పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన చేవెళ్ల శాసనసభ్యులు యాదయ్య, పామ్ ఆయిల్ పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని గురించి వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆయన కోరారు. ఈ మెగా ప్లాంటేషన్ తోట ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa