ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య, పిల్లలున్నవాడితో వద్దు బేటా అని చెప్పా.. యాంకర్ స్వేచ్ఛ తండ్రి ఆవేదన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 10:26 PM

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ శుక్రవారం (జూన్ 27) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే తాజాగా స్వేచ్ఛ మృతిపై స్పందించిన ఆమె తండ్రి శంకర్ వొటార్కర్.. సంచలన విషయాలు వెల్లడించారు. భార్యా పిల్లలు ఉన్వవాడితో వద్దూ బేటా.. అని చెప్పిన స్వేచ్ఛ వినలేదని అన్నారు. ఆమె చాలా ధైర్యవంతురాల, అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేదని కానీ ఇలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచందర్ రావు అనే వ్యక్తి మృగం అని, కనిపించిన అమ్మాయిని అనుభవించేవాడని సంచలన ఆరోపణలు చేశారు.


 'వాడో మృగం'


"మా అమ్మాయికి పెళ్లై కూతురు ఉంది. ఆ తర్వాత ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. మళ్లీ పెళ్లి చేద్దామని అనుకున్నా.. ఈ క్రమంలో స్వేచ్ఛకు ఓ న్యూస్‌ ఛానెల్‌లో పూర్ణ చందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వాడు ఒక మృగం. కనిపించిన అమ్మాయిని అనుభవించడానికి ప్రయత్నించే మృగం. నా కూతురుకు విడాకులు కాగానే వెంటపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ నేను, నా భార్య అందుకు ఒప్పుకోలేదు. వాడు ఇంతకుముందు వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. అందుకే భార్యాపిల్లలు ఉన్నోడ్నితో వద్దు బేటా.. భార్యాపిల్లలు లేనోడ్ని చేస్కో అని చెప్పాం." అని తెలిపారు స్వేచ్ఛ తండ్రి.


'ఐదేళ్లలో మొన్ననే మొదటిసారి చూశా'


"మొన్న, జూన్ 26న మొదటిసారి కలిశాడు. తామిద్దరం విడిపోతున్నామని, వచ్చి మాట్లాడమని మా అమ్మాయి చెప్పింది. అందుకే కలిశా. కూతురితో మాట్లాడిన తర్వాత. వాడితో మాట్లాడా. అప్పుడు వాడు.. మూడేళ్లు వెంటపడితే లివింగ్‌లో ఉండటానికి స్వేచ్ఛ ఒప్పుకుందని చెప్పాడు. అయితే ఆర్థికంగా కూడా ఆమెకు అంత అవసరం ఉండేది కాదేమో. అయితే ఇలా చిన్న చిన్న గొడవలు చాలా సార్లు వచ్చాయి. అతడి అమ్మానాన్నలతో మాట్లాడతాం అంటే.. మా బిడ్డ ఒప్పుకోలేదు. అలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పింది." అని చెప్పారు.


'ఇలాంటి మృగం సమాజానికి చేటు'


"ఇలాంటి మృగాలు ఉంటే సమాజానికి నష్టం. నా కూతురిలా ఎవరూ బలి కావొద్దు. వాడు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. చట్టబద్ధంగా వాడిని కఠినంగా శిక్షించాలని నా కోరిక. మళ్లీ జీవితంలో వాడు ఏ అమ్మాయి జోలికి వెళ్లొద్దు." అని చెప్పారు.


 


 


'మా అమ్మాయిది ఆత్మహత్య కాదు.. అనుమానం ఉంది'


"స్వేచ్ఛ మృతదేహాన్ని చూస్తే ఉరి వేసుకున్నట్లు లేదు. ముక్కులోంచి రక్తం వచ్చింది. ఆత్మహత్య లాగా అనిపిస్తలేదు. అనుమానంగా ఉంది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. మాకు నాయం జరిగేటట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నాం" అని స్వేచ్ఛ తండ్రి వెల్లడించారు.


'వాడే అంతకుడు.. మా అమ్మాయిని ట్రాప్ చేశాడు'


"పూర్ణచందర్.. స్వేచ్ఛను ట్రాప్ చేసి ఆమె తన జీవితాన్ని ముగించేలా చేశాడు. వాడే హంతకుడు. కేసు పెట్టి జైలుకు పంపి కఠినంగా శిక్షించాలి. అతడికి సహకరించిన వారు ఎవరున్నా.. వారిని కూడా శిక్షించాలి. అలాంటి వ్యక్తి పట్ల మహిళలందరూ అప్రమత్తంగా ఉండాలి. అందుకే మహిళలు అలర్ట్‌గా ఉండాలి. నిందితులను శిక్షించే వరకు జర్నలిస్టులు, మహిళా సంఘాలు, రాజకీయ నేతలు కూడా ముందుకు రావాలి అని కోరుతున్నా." అని స్వేచ్ఛ తల్లి భావోద్వేగానికి గురయ్యారు. తన 14ఏళ్ల మనుమరాలు కూడా గొడవలు జరుగుతున్నప్పుడు ధైర్యంగా తన తల్లికోసం కాపలా ఉందని తెలిపారు. ఇక, పర్సనల్ సమస్యల వల్లే తన తల్లి ఇలా చెప్పిందని స్వేచ్ఛ కుమార్తె తెలిపింది. సాధారణంగా ఇలా ఉండేది కాదని చెప్పింది.


జవహర్ నగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకొని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్టు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. స్వేచ్ఛ అంత్యక్రియలు శనివారం (జూన్ 28) సాయంత్రం రాంనగర్ పరిధిలోని అడిక్‌మెట్ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa