చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరాటే రామ నరసింహారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, స్థానికంగా ప్రజలకు సేవలందించిన రామ నరసింహారెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం రామ నరసింహారెడ్డి నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడుతూ, స్థానిక సమస్యల పరిష్కారంలో రామ నరసింహారెడ్డి చేసిన కృషిని గుర్తు చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, గ్రామంలోని ప్రజలకు ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వీరేశం అన్నారు.
అనంతరం, ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామ నరసింహారెడ్డి మృతి పట్ల ప్రజలు, పార్టీ కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa