కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. హైడ్రా కూల్చివేతలపై ఇదివరకే ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన.. మరోసారి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతలను టార్గెట్ చేస్తూ కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ (సోమవారం) జవహర్ నగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించారు. '30, 60 గజాల్లో ఇళ్లు కట్టుకునేవాడు పేదవాడా? ధనవంతుడా? మూర్ఖులారా..' అని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి కళ్లు కనబడటం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన బంజారా హిల్స్లో రూ.50 కోట్లు, రూ.60 కోట్లు, రూ.100 కోట్ల విలువైన భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఆ భూములను రిజిస్టర్ చేయడానికి జీవో నెం.58, 59 తీసుకొచ్చారని గుర్తు చేశారు. 'వాటిని రిజిస్టర్ చేయడానికి జీవో నెం.58, 59 తీసుకొచ్చారు కదరా నా***' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదల జీవితాలతో చెలగాటమాడితే ఏం రాదని.. రేవంత్ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటోందని వారి శాపం తప్పక తగులుతుందని ఈటల హెచ్చరించారు. లంచాలు ఇవ్వకపోతే ఇళ్లను గద్దల్లా వాలి కూల్చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా నిరుపేదల విషయంలో ప్రభుత్వం పిచ్చి వేషాలు మానేయాలని, లేకపోతే భారీ ఉద్యమాన్ని చేపడతామని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ కూల్చివేతలు పేదల హక్కులను ఉల్లంఘించడమేనని వెంటనే వాటిని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నగర పరిధిలోని మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా ఆక్రమణల తొలగింపు చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అడ్డుకున్నారు. హైడ్రా కూల్చివేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాటిని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువులో భారీ ఎత్తున ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను హైడ్రా కూల్చివేసింది.
అంతేకాకుండా చెరువు సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్లను తొలగించారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా హెచ్చరించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను కూడా సీజ్ చేశారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జోక్యం చేసుకుని కూల్చివేతలను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కూల్చివేతలను నిలిపివేయాలని ఆయన అధికారులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa