ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహా జాతర షెడ్యూల్ విడుదలైంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు ములుగు జిల్లాలోని మేడారంలో జాతర జరుగుతుంది. జనవరి 28వ తేదీన సారలమ్మ, గోవిందా రాజు, పగడిద్దరాజు గద్దెలకు చేరుకుంటారు. జనవరి 29న సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa