జగిత్యాల జిల్లా కేంద్రంలో షాపింగ్ ప్రియులకు నూతన ఆకర్షణగా 'కాసం సెలక్షన్స్' పేరుతో వస్త్రాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ప్రముఖ టెలివిజన్ సీరియల్ నటి అనసూయ ఈ మాల్ను ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రారంభ వేడుక సందర్భంగా అనసూయను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ప్రారంభ కార్యక్రమం సందర్భంగా రోడ్డుపైనే నిలబడి ప్రజలు అనసూయను తిలకించారు. ఆమె అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ స్నేహపూర్వకంగా ముచ్చటించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మల్టీ కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్శకులు కాసం సెలక్షన్స్ షాపింగ్ మాల్లోని నూతన వస్త్ర సంపదను ఆస్వాదించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని యాజమాన్యం తెలిపింది. ఈ కొత్త వస్త్రాలయంతో జగిత్యాల పట్టణంలో షాపింగ్కు ఒక కొత్త హబ్ ఏర్పడనుందని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa