ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిగాచి కంపెనీ ప్రమాదంలో 40 మంది మృతి, ప్రకటించిన కంపెనీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 05:28 PM

పాశమైలారంలోని తమ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 40 మంది కార్మికులు, సిబ్బంది చనిపోయారని సిగాచి కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పేలుడు ఘటనలో 33 మంది గాయపడ్డారని, వారిని వివిధ ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కంపెనీ ఈ ప్రకటనలో హామీ ఇచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలిపింది.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ రోజు ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి ఆయన లేఖ రాశారు. ఈ ఘటనకు రియాక్టర్‌ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సిగాచి పాశమైలారం ప్లాంటును 90 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa