ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబ్ నగర్‌లో ఫర్టిలైజర్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. రైతులకు పారదర్శక సరఫరా ఆదేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 01:55 PM

మహబూబ్ నగర్ జిల్లా అర్బన్ మండలంలో బుధవారం కీలక చర్యలు తీసుకున్నారు అధికారులు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా వ్యవసాయ అధికారి సాక్షిగా పలు ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫర్టిలైజర్లు, యూరియా నిల్వలతో పాటు స్టాక్ రికార్డులు, సరఫరా పద్ధతులు పరిశీలించారు.
అధికారుల ఆకస్మిక దాడులతో కొంతమంది వ్యాపారుల్లో ఉలికిపాటు కనిపించింది. అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వని కొన్ని దుకాణాల్లో రికార్డుల లోపాలు బయటపడినట్లు సమాచారం. స్టాక్ వివరాలు, బిల్లుల జారీపై స్పష్టత లేని కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ, "రైతుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉంది. ఎవరూ ఫర్టిలైజర్ కృత్రిమ కొరత సృష్టించకూడదు. యూరియా సరఫరా పారదర్శకంగా, సమయానికి అందించాలి," అని హెచ్చరించారు. రైతుల కోసం ఇటువంటి తనిఖీలు మరింత గట్టిగా కొనసాగుతాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa