కొండా దంపతుల ఎపిసోడ్తో వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. సురేఖ, మురళి దంపతుల కుమార్తె కొండా సుష్మితా పటేల్ పొలిటికల్ ఎంట్రీ కూడా చర్చకు దారి తీసింది. గత కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న సుష్మితా ఇటీవల తన సోషల్ మీడియాలో 'పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి' అని పేర్కొనడం చర్చకు దారితీసింది. ఇది వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రకంపనలు సృష్టిస్తోంది. కొండా దంపతుల రాజకీయ వారసురాలిగా సుష్మితను రంగంలోకి దిగుతోందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో కూడా ఆమె పేరు వినిపించింది, పరకాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆ సీటును రేవూరికి కేటాయించడంతో ఆమె వెనక్కి తగ్గింది.
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు చెలరేగుతున్న సమయంలో కొండా సుష్మితా పటేల్ తన ఇన్స్టాగ్రామ్ బయోను 'పరకాల ఆస్పిరెంట్' (పరకాల టికెట్ ఆశిస్తున్నాను) అని అప్డేట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మెుదలైంది. అనంతరం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యే కొండా దంపతులపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇది వరకే వివరణ ఇచ్చిన కొండా మురళీ తాజాగా.. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ లిఖతపూర్వకంగా వివరణ అందజేసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ కూతురి రాజకీయ ఎంట్రీపై కొండా దంపతులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమ కూతురు ఆలోచనను తాము కాదనలేమని అన్నారు. తనలో ప్రవహించేది తమ రక్తం కాబట్టి.. వారసత్వం కొనసాగుతుందని అన్నారు.
తన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు. అయితే, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటామని ఆమె తెలిపారు. మరోవైపు కొండా మురళి మాత్రం కొంత భిన్నంగా స్పందించారు. తన కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదని చెప్పారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని.. తన కూతురు తొందరపడి అన్నదో.. ఆలోచించి అన్నదో తనకైతే తెలియదని అన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వరంగల్ పాలిటిక్స్లో హాట్ టాఫిక్గా మారాయి. ఆమె పొలిటికల్ ఎంట్రీపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa