ట్రెండింగ్
Epaper    English    தமிழ்

70 ఏళ్ల వయసులో భార్యకు విడాకులు ఇచ్చిన వృద్ధుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 09:19 PM

నేటి కాలంలో మన సమాజంలో విడాకులు సర్వ సాధారణం అయ్యాయి. నచ్చితే కలిసి ఉందాం.. లేదంటే విడిపోదాం అనే ధోరణి పెరిగిపోతుంది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈమధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న వారిలో నడివయసు దంపతుల సంఖ్య ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పటి వరకు పిల్లల కోసం భాగస్వామిని భరించిన వారు.. బాధ్యతలు పూర్తయిన తర్వాత విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హై కోర్టు 70 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌కు విడాకులు మంజూరు చేసింది. పెళ్లైన 42 ఏళ్ల తర్వాత ఆ దంపతులకు డైవర్స్ ఇచ్చింది. ఈ క్రమంలో సదరు టీచర్‌పై అతడి భార్య చేసిన ఆరోపణలు అవాస్తవం అని కోర్టు తేల్చింది. ఆ వివరాలు..


తెలంగాణ హైకోర్టు.. 70 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌కు 62 ఏళ్ల అతడి భార్య నుంచి విడాకులు మంజూరు చేసింది. వీరికి 42 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. కానీ సుమారు పాతికేళ్ల నుంచి అనగా 1991 నుంచే వీరిద్దరు విడిగా ఉంటున్నారు. సదరు టీచర్ భార్య.. అతడి మీద అనేక క్రిమినల్ కేసులు పెట్టింది. వరకట్న వేధింపులు కేసుతో పాటుగా 1996 అంటెప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టింది. అయితే ఇవన్ని నిరాధార ఆరోపణలని ఈ కేసు తీర్పు సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది.


వివాహం తర్వాత దంపతుల మధ్య వెలుగు చూసిన మనస్పర్థల కారణంగా వీరు 1991 నుంచే వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో సదరు రిటైర్డ్ టీచర్ భార్య నుంచి విడాకులు పొందడం కోసం ముందుగా ఫ్యామిలీ కోర్డును ఆశ్రయించాడు. అయితే కోర్టు అతడి పిటిషన్‌ని కొట్టి వేసింది. దీంతో అతడు 2015లో హైకోర్టును ఆశ్రయించాడు. ఈక్రమంలో సదరు రిటైర్డ్ టీచర్ భార్య ఆయనపై నమోదు చేసిన క్రిమినల్ కేసలు, వరకట్న వేధింపుల కేసు, అందుకు సంబందించిన సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. జస్టిస్ మౌషుమి భట్టాచార్య, బీఆర్ మాధుసూదన్ రావుల బెంచ్‌కి ఈ పిటిషన్‌ని అప్పగించింది.


ఇరువురి వాదనలు విన్న బెంచ్.. రిటైర్డ్ టీచర్ భార్య చేసిన ఆరోపణలు, పెట్టిన కేసులు నిరాధారమైనవని నమ్మింది. దీంతో పది రోజుల క్రితం అనగా జూన్ 23, 2025న సదరు 70 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌కు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారికి 42 సంవత్సరాల క్రితం పెళ్లైనా.. వారు కలిసుంది మాత్రం కేవలం 8 సంవత్సరాలే అని తెలిపింది. భార్య బనాయించిన కేసుల వల్ల సదరు టీచర్ ఇన్నాళ్లు మానసిక క్షోభ అనుభవించాడని కోర్టు అభిప్రాయపడింది.అంతేకాక దంపతులిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ఆస్తి వివాదం కూడా నడుస్తుందని కోర్టు తెలిపింది. భార్య అతడి మీద పలు కేసులు పెట్టడం వల్ల.. అతడు అందరికి దూరంగా ఉంటూ ఒంటరితనంతో బాధపడ్డుట్టుగా కోర్టు చెప్పుకొచ్చింది.


సదరు రిటైర్డ్ టీచర్ విడాకులు కోసం ముందుగా ఫ్యామిలీ కోర్టును సంప్రదించాడు. ఆ సమయంలో కోర్టు.. సదరు టీచర్ తన భార్యతో కలిసి ఉండేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదని అభిప్రాయపడింది. ఈ కారణం చేత అతడికి విడాకులు మంజూరు చేయడానికి అంగీకరిండం లేదని తెలిపింది. కానీ హైకోర్టు మాత్రం ఈ వాదనను వ్యతిరేకించింది. అంతేకాక సదరు టీచర్ మీద అతడి భార్య చేసిన అభియోగాలను నిరూపించే ఆధారాలను సమర్పించలేదని స్పష్టం చేసింది. అంతేకాక సదరు టీచర్‌ తల్లి చెప్పిన సాక్షాలను పరిగణిలోకి తీసుకున్న కోర్టు.. అతడినిన నిర్దోషిగా ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa