కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం కేవలం ఓటు బ్యాంకు రాజకీయం అని ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఇది సాధ్యం కాని హామీ అని, న్యాయంగా, సాంఘికంగా ఇది అమలు చేయలేనిదని ఆయన స్పష్టం చేశారు.
కేవలం 18 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు విరక్తి చెందారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, దాంతో ప్రజల్లో నిరాశ పెరిగిందన్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో అధిక నిరాశ నెలకొంది అని ఆయన తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారని గౌడ్ అన్నారు. తమ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనే ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గుతున్నారని విమర్శించారు. మోసపూరిత హామీలతో ప్రజలను మరింత మోసం చేయాలని కాంగ్రెస్ యత్నిస్తోందని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa