ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ గ్రూప్-1 కేసులో వాదనలు పూర్తి తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 08:23 PM

తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియలో నెలకొన్న వివాదంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం, తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. దీంతో గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమ జవాబు పత్రాలను రీ-వాల్యుయేషన్ చేయాలని వారు పిటిషన్‌లో కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, గ్రూప్-1 పరీక్షలను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.గతంలో ఈ నియామకాలపై జస్టిస్ రాజేశ్వరరావు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ధర్మాసనం, తదుపరి తీర్పును వెల్లడించేంత వరకు రిజర్వ్‌లో ఉంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa