ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 12:07 PM

దివంగత మహానేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa