తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేని దుర్భర పరిస్థితిలో ఉందని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం కోసం గత మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఒకపూట భోజనం అందించే స్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం దారుణమని హరీశ్రావు పేర్కొన్నారు. విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహించగల మంత్రి కాంగ్రెస్లో లేరా అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల పోషణకు, విద్యా ఆసక్తికి కీలకమని హరీశ్రావు గుర్తు చేశారు. ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి, పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa