ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుంగతుర్తిలో బీఆర్ఎస్ వినూత్న నిరసన.. రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 03:55 PM

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై పొర్లు దండాలు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు వెడల్పు కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
తాటికొండ సీతయ్య మాట్లాడుతూ, గత ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆధ్వర్యంలో రూ. 3.50 లక్షలతో రోడ్డు నిర్మాణానికి నిధులు తెచ్చారని, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన కూడా జరిగిందని తెలిపారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ నిరసన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాలగొన్నారు. రోడ్డు వెడల్పు పనులు పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ప్రభుత్వం తమ నిరసనను గమనించి, వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ వినూత్న నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa