హైదరాబాద్లోని కొంపల్లిలో ఉన్న మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా భారీ డ్రగ్ రాకెట్ను తెలంగాణ నార్కోటిక్ విభాగం ఈగల్ టీం బుధవారం బట్టబయలు చేసింది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నైజీరియన్ డ్రగ్ ట్రాఫికర్లతో కలిసి పనిచేస్తూ, మహిళల హైహీల్స్ చెప్పుల్లో డ్రగ్స్ను రహస్యంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ డ్రగ్ రాకెట్లో పలు ప్రముఖ పబ్ యజమానులు, 23 మంది పారిశ్రామికవేత్తలు, ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్నతో సహా పలువురు ప్రమేయం ఉన్నట్లు ఈగల్ టీం వెల్లడించింది. సూర్య తన రెస్టారెంట్లో డ్రగ్స్ను నిల్వ చేసి, హైదరాబాద్లోని ఉన్నత స్థాయి పబ్లైన ప్రిజం, ఫామ్ పబ్, బ్లాక్ 22, బర్డ్ బాక్స్, జోరా, బ్రాడ్వే, క్వేక్ అరేనా వంటి ప్రదేశాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఈ పబ్లలో రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించినట్లు అధికారులు ఆరోపించారు.
ఈ ఆపరేఏషన్లో సూర్య నైజీరియన్ సరఫరాదారులైన నిక్, జెర్రీ, డెజ్మండ్, స్టాన్లీ, ప్రిన్స్లతో కలిసి పనిచేసినట్లు విచారణలో తేలింది. 2021 నుంచి 2025 వరకు సూర్య 20 సార్లు కొకైన్ కొనుగోలు చేసినట్లు అతను అంగీకరించాడు. ఈ డ్రగ్స్ను కొరియర్ సర్వీసుల ద్వారా గృహోపకరణాల్లో దాచి రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈగల్ టీం ఈ రాకెట్ను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది, యువతను డ్రగ్స్ వ్యసనం నుంచి కాపాడేందుకు ప్రజలు, హాస్పిటాలిటీ రంగం సహకరించాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa