ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెదిరింపుల కేసులో.. హెచ్‌సీఏ అధ్యక్షుడు అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 08:30 PM

ఐపీఎల్ టిక్కెట్లకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు వివాదంలో సీఐడీ చర్యలు చేపట్టింది. ఐపీఎల్ సందర్భంగా టిక్కెట్ విషయంలో హెచ్‌సీఏ బెదిరింపులకు పాల్పడినట్టు ఎస్ఆర్‌హెచ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేసిన సీఐడీ.. హెచ్‌సీఏ ఛైర్మన్ జగన్మోహనరావుతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేసింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై సీఐడీ కేసు నమోదుచేసింది. హెచ్‌సీఏ‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించిన విజిలెన్స్.. చర్యలకు సిఫార్సు చేసింది. లక్నోతో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీకి హెచ్‌సీఏ తాళాలు వేసింది. హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే.. 10 శాతం టిక్కెట్లు ఇవ్వడానికి సన్‌రైజర్స్ అంగీకరించింది. కానీ, తనకు వ్యక్తిగతంగా టిక్కెట్ ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేసినట్టు తేలింది. అడిగినన్ని టిక్కెట్లు ఇవ్వకుంటే మ్యాచ్ జరగనివ్వనని బెదిరించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నాన్ని తమ హోమ్ గ్రౌండ్ చేసుకోవాలంటూ ఆఫర్ కూడా ఇవ్వడం గమనార్హం.


ఒకానొక దశలో తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియాన్ని వదిలి వెళ్తామంటూ సన్‌రైజర్స్ అసహనాన్ని వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాస్‌ల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రకటన చేయడం కలకలం రేగింది.


ఐపీఎల్ ఒప్పందం ప్రకారం.. HCAకు 10 శాతం ఉచిత టిక్కెట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎస్ఆర్‌హెచ్ ఇవ్వాలి. అందులో భాగంగా 50 టిక్కెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ బాక్స్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు కేటాయించారు. కానీ, ఈ సీజన్‌లో ఆ బాక్స్ సామర్థ్యం 30కి తగ్గిపోయిందని, అదనంగా మరో 20 టిక్కెట్లు కావాలని HCA డిమాండ్ చేసింది. దీనిపై SRH ప్రతినిధులు చర్చిద్దామని చెప్పగా.... లక్నోతో మ్యాచ్ సందర్భంగా HCA అధికారులు వారి కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేశారు. 20 టిక్కెట్లు ఇస్తేనే తాళం తీస్తామని ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు వచ్చాయి. సీఎం ఆదేశాలతో విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి నివేదికను అందజేసింది. ఈ సిఫార్సుల ఆధారంగానే సీఐడీ కేసు నమోదుచేసి.. తాజాగా ఇద్దర్ని అరెస్ట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa