జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం ఏనబావి గ్రామ శివారు పిట్టలోనిగూడెంలో జరిగిన దారుణ ఘటన తెలంగాణలో కలకలం సృష్టించింది. కాల్వ కనకయ్య (30) అనే వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు, శిరీష మరియు గౌరమ్మ, కలిసి గొడ్డలితో నరికి హత్య చేశారు. కనకయ్య మద్యానికి బానిసై, తన భార్యలను నిత్యం వేధించడంతో పాటు, గ్రామస్థులను బెదిరించేవాడని స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి గొడ్డలితో భార్యలను బెదిరించేందుకు వచ్చిన కనకయ్యను, ఆ ఇద్దరు భార్యలు ఎదురు తిరిగి, అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని దేవాదుల కాల్వలో పడేశారు.
ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనకయ్య గతంలో మద్యం మత్తులో తన రెండో భార్య శిరీష తల్లి జున్నుబాయిని హత్య చేసి, ఆమె భర్త చిన్నరాజయ్యను గాయపరిచాడు. ఈ ఘటన తర్వాత జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్పై విడుదలైన కనకయ్య, మళ్లీ గ్రామానికి వచ్చి భార్యలను బెదిరించాడు. అతని ఆగడాలకు విసిగిపోయిన శిరీష మరియు గౌరమ్మ, అతని సొంత అక్క, చెల్లెలు సహకారంతో హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు గ్రామస్థుల సమక్షంలో జరిగినట్లు సమాచారం.
మరింత దిగ్భ్రాంతికరంగా, కనకయ్య తన మైనర్ చెల్లెలు మరియు చిన్నమ్మపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితులు స్వయంగా పోలీసులకు వెల్లడించారు. ఈ దారుణాలు కనకయ్యపై భార్యల కోపాన్ని మరింత పెంచాయని, అందుకే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనగామ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ హత్యలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa