ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతని చర్యలు తెలంగాణ ప్రజలని అవమానించేలా ఉన్నాయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 02:08 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎస్. మాధవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో కూడిన పటాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల పోరాటాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీని ఉద్దేశించి 'ఎక్స్' వేదికగా ఆయన స్పందించారు.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి చర్య తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని, చరిత్రను అవమానించే విధంగా ఉందని కేటీఆర్ అభివర్ణించారు. "మా సాంస్కృతిక గుర్తింపు, చారిత్రక స్థానం, భౌగోళిక ఉనికి కోసం తరతరాలుగా పోరాడి తెలంగాణను సాధించుకున్నాం. అలాంటిది మీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించి 'అఖండ ఆంధ్రప్రదేశ్' పటాన్ని బహూకరించడం మా పోరాటాన్ని కించపరచడమే" అని కేటీఆర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa