కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణను పలువురు కాలనీ సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీల్లో మౌలిక వసతుల కొరత, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, కరెంట్ సరఫరా వంటి అంశాలపై వారు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై శంభీపూర్ క్రిష్ణ సానుకూలంగా స్పందించారు. ప్రజల అభ్యర్థనలను గమనించిన ఆయన, ప్రతి ఒక్క సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తమ పార్టీ లక్ష్యమని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్యలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు. ప్రజల సహకారంతో గ్రామ, నగర అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa