ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ నేతలకి కృతజ్ఞతలు తెలిపిన రాజాసింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 05:22 PM

బీజేపీ అధిష్ఠానం తన రాజీనామాను ఆమోదించిన అనంతరం గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. పదవుల కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని, తుది శ్వాస వరకు సమాజ సేవలో నిమగ్నమవుతానని, హిందూ సమాజం హక్కుల కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.సుమారు 11 సంవత్సరాల క్రితం తాను బీజేపీలో చేరిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేసుకున్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో పాటు హిందువుల హక్కుల పరిరక్షణ కోసం తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆ తరువాత బీజేపీ తనపై నమ్మకంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టును ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన బీజేపీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa