ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 13 నుంచి 3 రోజుల పాటు ఆ ప్రాంతాల వైపు వెళ్లకండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 08:27 PM

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. మూడు రోజుల పాటు వాహనదారులు.. సికింద్రాబాద్ వైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఎందుకు సికింద్రాబాద్ వైపు వెళ్లకూడదు.. మూడు రోజుల పాటు ఆంక్షలు ఎందుకు విధించారు.. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే వివరాలు తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా మీప్రయాణాలను ప్లాన్ చేసుకోండి. లేదంటే ప్రయాణం మొదలైన తర్వాత లేనిపోని చిక్కులు తలెత్తి.. ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతకు ఈ ఆంక్షలు ఎందుకు విధించారు.. ఏ ప్రాంతాల్లో అంటే..


సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. జులై 13 నుంచి 15 వరకు అంటే మూడు రోజుల పాటు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కారణం ఏంటంటే సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర. జులై 13, ఆదివారం నాడు సికింద్రాబాద్ మహంకాళి బోనాలు జరుగుతున్నాయి. మరుసటి రోజు అనగా జులై 14, సోమవారం నాడు రంగం వేడుక నిర్వహిస్తారు. బోనాల వేడుకలో పాల్గొనడం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జులై 13-15 వరకు మూడు రోజుల పాటు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు దీన్ని గమనించి.. పోలీసులకు సహకరించాలని కోరారు.


ఈ మూడు రోజల పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండటంతో వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. కాదని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కనుక సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనదారులు.. జులై 13-15 వరకు మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.


సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనం సమర్పిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈక్రమంలో ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్, దేవాదాయ, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా.. ప్రజల సహకారం తప్పనిసరి ఉండాలని లేదంటే జనాలే ఇబ్బంది పడతారన్నారు. లష్కర్ బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలంటే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. ప్రజలందరూ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మంత్రి పొన్నం సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa