ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో హత్యకి గురైన తెలంగాణ వ్యక్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 12, 2025, 03:49 PM

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.యాదాద్రి భువనగిరి జిల్లా, సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ (32) అనే భక్తుడు గిరి ప్రదక్షిణ చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కిందపడిన విద్యాసాగర్ ఆ యువకులతో గొడవకు దిగాడు.అయితే ఆ యువకులు తీవ్ర ఆగ్రహంతో తమ వద్ద ఉన్న కత్తితో విద్యాసాగర్‌పై దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను సహచర భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ విద్యాసాగర్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు తిరువణ్ణామలైకి చెందిన గుగనేశ్వరన్, తమిళరసన్ అని గుర్తించి అరెస్టు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa