తెలంగాణలో గత పదేళ్ల BRS ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3.54 లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష ఇచ్చారు.
BRS పాలనలో పేదలకు తగిన సంక్షేమ పథకాలు అందలేదని పొంగులేటి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పునరుద్ఘాటించారు.
తమ ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తుందని పొంగులేటి వెల్లడించారు. రేషన్ కార్డుల పంపిణీతో పాటు, ఇతర సంక్షేమ పథకాలను కూడా వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ధ్యేయమని, ఈ దిశగా అడుగులు వేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa