హైదరాబాద్లోని మలక్పేట శాలివాహననగర్ పార్కులో మంగళవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. చందు నాయక్ అనే వ్యక్తిపై నలుగురు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మలక్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
కేసు దర్యాప్తు ప్రారంభమైన కొద్ది సమయంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పులకు పాల్పడిన నలుగురు నిందితులు ఎస్వోటీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో రాజేష్, శివతో పాటు మరో ఇద్దరు ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు మారుతి స్విఫ్ట్ కారులో వచ్చి, చందు నాయక్పై కారం చల్లి, ఆ తర్వాత కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ హత్య వెనుక పాత కక్షలు, ఆర్థిక వివాదాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చందు నాయక్తో పాటు నిందితులు గతంలో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాలను స s / ేకరిస్తూ ఈ హత్య వెనుక గల పూర్తి వివరాలను రాబట్టే పనిలో పడ్డారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేకెత్తించింది, దీనిపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa