తెలంగాణ ప్రజలకు.. ముఖ్యంగా రైలు ప్రయాణికులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా చాలా రైళ్లు ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కాచిగూడ నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్కు ఒక సరికొత్త రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కొత్త రైలును అత్యాధునిక ఎల్హెచ్బీ (బోగీలతో నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఎల్హెచ్బీ బోగీలు సాధారణ బోగీల కంటే సురక్షితమైనవి, సౌకర్యవంతమైనవిగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇవి అత్యంత వేగంగా ప్రయాణించగలవు. సాధారణ రైల్లో గమ్యస్థానానికి 2 గంటలు పట్టే సమయం ఇక్కడ ఈ ట్రైన్లో మాత్రం గంటన్నరలో వెళ్లిపోవచ్చు. ఈ రైలులో 7 స్లీపర్ కోచ్లు, 7 థర్డ్ ఏసీ బోగీలు, 2 సెకండ్ ఏసీ బోగీలు, 4 జనరల్ బోగీలు, ఒకటి చొప్పున లగేజీ, దివ్యాంగుల కంపార్ట్మెంట్లు సహా మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఇది ప్రయాణికులకు అన్ని వర్గాల వారికి అనుకూలమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
ఈ కొత్త సర్వీస్ను జూలై 19, 2025న కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభం రోజున ఈ రైలు ప్రత్యేక సర్వీస్గా నడిచి.. ఆ తర్వాత జూలై 20, 2025 నుంచి రెగ్యులర్గా సేవలు అందించనుంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు వారం మొత్తం నడుస్తుంది. ప్రతిరోజూ రాత్రి 11:50 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ (రైలు నంబర్ 17605) నుంచి బయలుదేరి, నిజామాబాద్-ముద్కేడ్-నాందేడ్-పూర్ణ-అకోలా-ఇటార్సీ-ఉజ్జయిని-అజ్మేర్ మీదుగా జోధ్పూర్లోని భగత్ కీ కోఠీ స్టేషన్కు చేరుకుంటుంది.
ఈ కొత్త రైలు మార్గం తెలంగాణ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల గుండా వెళుతుంది. ఈ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్లోని పర్యాటక ప్రాంతాలకు, ఇతర నగరాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్లోని ప్లాట్ఫారాలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణ పనులు జరుగుతున్నందున.. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్కు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ కొత్త రైలు సేవలు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు.
ఇప్పటి వరకు ఆ రాష్ట్రాలకు డైరెక్ట్ ట్రైన్ ఉంటే బాగుండు అని అనుకునే వారికి ఇది పెద్ద ఉపశమనం అనే చెప్పాలి. ఇక నుంచి కాచిగూడు రైల్వే స్టేషన్ నుంచే రాకపోకలు సాగించవచ్చు. కాచిగూడు రైల్వే స్టేసన్ కు ఎంతో చరిత్ర ఉంది. ఇటీవల దీనిని నిర్మించి 109ఏళ్లు పూర్తయ్యాయి. నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ను 1916 జూన్లో ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa