ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్ విశ్వవిద్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 05:08 PM

సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్ విశ్వవిద్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల రుషికేశ్ అనే విద్యార్థి క్యాంపస్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.విశ్వవిద్యాలయ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రుషికేశ్ స్వస్థలం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సెల్ఫీ వీడియోను పరిశీలించిన అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa