ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేభారత్‌ రైళ్ల ప్రయాణికులకు గుడ్ న్యూస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 03:43 PM

సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.దీంతో ఆగస్టు 25నుంచి ఏలూరులో, 20833/20834 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‏లకు ఆగస్టు 2నుంచి సామర్లకోటలో అదనపు స్టాపేజీలు మరో ఆరునెలల పాటు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa