ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల జలపాతంలో గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. మృతుడు ఆదిలాబాద్ మండలం భూక్తాపూర్కు చెందిన మనోహర్ సింగ్ అని గుర్తించారు. బుధవారం స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గల్లంతైన వెంటనే అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే నీటి ప్రవాహం పెరగడం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. చివరకు గురువారం ఉదయం అతని మృతదేహం జలపాతానికి కొద్దీ దూరంలో లభ్యమైంది.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి వచ్చారు. ఒక్కసారిగా తమ కుమారుడిని కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ సంఘటనతో భూక్తాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఖండాల జలపాతం వద్ద భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa