సాధారణంగా ఉద్యోగులు.. కొలువులో చేరిన రెండు, మూడు ఏళ్ల తర్వాత పదోన్నతి ఆశిస్తారు. అదే ప్రైవేటులో అయితే ప్రమోషన్ అంశం కంపెనీ యాజమాన్యం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రభుత్వ కొలువు చేసే వారికి ఇలాంటి అడ్డంకులు ఉండవు. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి కోసం సుమారు 18 ఏళ్లుగా ఎదురు చూశారు. ఇన్నాళ్ల వారి నిరీక్షణకు రేవంత్ సర్కార్ ఎండ్ కార్డ్ వేసింది. ఆ శాఖ ఉద్యోగుల పదోన్నతులకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏళ్ల తర్వాత ప్రమోషన్లు పొందబోతుండటంతో సదరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు వారు ఏ ఉద్యోగులు అంటే..
తెలంగాణ సర్కార్.. నీటి పారుదల శాఖలో ప్రమోషన్లకు లైన్ క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ శాఖలో పనిచేస్తున్న 127 మంది ఏఈఈలు పదోన్నతులు పొందనున్నారు. వీరంతా 18 ఏళ్లుగా పదోన్నతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీరి సమస్య తెలుసుకున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో వీరి సమస్య పరిష్కారం అయ్యింది. దీంతో ఈ శాఖ అధికారులు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
నీటి పారుదల శాఖలో పదోతన్నతులకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ (డీపీసీ) ఆమోద ముద్ర వేయడంతో వీరి ప్రమోషన్స్ అంశం ముందుకు కదిలింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ముందుగా 2008 బ్యాచ్ ఏఈఈలకు, ఎస్ఈలకు ప్రమోషన్లు ఇచ్చేలా డీపీసీలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల 2008 బ్యాచ్కు చెందిన 127 మంది ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లను కల్పించేందుకు డీపీసీ ఓకే చెప్పింది.
ఏఈఈలతో పాటుగా.. మరో 13 మంది ఎస్ఈలకు ప్రమోషన్ ఇచ్చి.. వారిని సీఈలుగా ప్రమోట్ చేయనున్నారు. ప్రభుత్వం దీనికి కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర తెలపనుందని సమాచారం. కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి డీపీసీలో ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లు ఇస్తూ ఆమోదం తెలపడం ఇదే ప్రథమం కావడం విశేషం.కాగా ఈ పదోన్నతులకు సంబంధించి ప్రభఉత్వం జోన్ 5, జోన్ 6 సమస్యలు, సీనియారిటీ అంశం వంటి అన్ని సమస్యలను పరిష్కరించి ఏఈఈల ప్రమోషన్లకు లైన్ క్లియర్ చేసింది.
18 సంవత్సరాల తర్వాత 2008 బ్యాచ్కు చెందిన ఏఈఈలకు ప్రమోషన్ ఇస్తుండటంతో.. దీనికి సంబంధించి త్వరగా జీవో జారీ చేయాలని సీనియర్ ఏఈఈలు కోరారు. ప్రమోషన్ పొందడం కోసం తాము ఇన్ని సంవత్సరాలుగా కోర్టు కేసులు, సీనియారిటీ సమస్యలు, జోన్ల వివాదాలు వంటి సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. అలానే రాష్ట్రంలోనే తొలిసారిగా డీపీసీలో క్లియర్ చేసి ప్రమోషన్లకు ఆమోదం తెలపడం ఇదే ప్రథమం అని.. ఇందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa