ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారు: జగదీశ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 07:21 PM

TG: సోనియాగాంధీ అవార్డుకు రేవంత్ రెడ్డి మాత్రమే అర్హుడు అని BRS నేత జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. 'అబద్ధం సిగ్గుపడేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆస్కార్ అవార్డుకు అర్హుడు. స్క్రిప్ట్ రాసిస్తున్న వాళ్ళు రేవంత్ రెడ్డి పరువు తీస్తున్నారు. నీ పక్కన ఉన్నవాళ్లతో నీకు భయం ఉంటే మేము ఏం చేయలేము. అందుకే మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నావు. ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారు' అని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa