మానవత్వం మరిచిన ఘోర సంఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే ఏడేళ్ల బాలిక తన స్నేహితులతో ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లిన సమయంలో ఆమెపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన వారిలో బాధిత బాలిక సొంత అన్నయ్య కూడా ఉండడం ప్రజలను షాక్కు గురి చేసింది.
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. బాలిక తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో బాలికల రక్షణపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడం, పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa