తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ శుభవార్త. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని శ్రావణ మాసంలో ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. అర్హులైన ప్రతి కుటుంబానికీ సొంతింటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
రేషన్ కార్డుల పంపిణీ..
గత దశాబ్దకాలంగా రాష్ట్రంలో రేషన్ కార్డులు, ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు పొందలేని పరిస్థితి ఉండేదని, ఎంతో మంది అర్హులు ఈ సేవలకు దూరమయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కొత్తగా పెళ్లయిన వారికి, ఇంట్లో పుట్టిన పిల్లలకు రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు చేయలేని పరిస్థితులు ఉండేవని, దీంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని ఆయన గుర్తు చేశారు.
పిరుదులపై వచ్చే కురుపులు లేదా గడ్డల్ని తగ్గించే ఇంటి చిట్కాలు, ఏ ఒక్కటి ట్రై చేసినా అంతా క్లియర్ అయిపోతుంది
అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీని చేపట్టిందని మంత్రి తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా మీ సేవా కేంద్రంలో కొత్త సభ్యులను యాడ్ చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో హుజురాబాద్, నాగార్జునసాగర్ లాంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రేషన్ కార్డులు వచ్చేవని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు అందజేయడమే కాకుండా, వాటి ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోందని మంత్రి అన్నారు. గత నెలల్లో రైతు భరోసా పథకం కింద పంట సాయం అందిందని, ఇందిరమ్మ ఇళ్ల పండగ కూడా జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు శ్రావణ మాసంలో రేషన్ కార్డులు, ఆ వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. గతంలో దొడ్డు బియ్యం తినలేక తిరిగి అమ్ముకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం తీసుకొని హాయిగా భోజనం చేస్తున్నారని చెప్పారు. పెద్దలకు, ధనవంతులకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యం ఇప్పుడు పేదలకూ అందుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో.. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని.. ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడే ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ పాలసీ అని మంత్రి స్పష్టం చేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే 1,150 కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని.. 4,220 మంది కొత్త పేర్లు నమోదు అయ్యాయని మంత్రి తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 33,971 నుంచి 35,121కి పెరిగిందని, లబ్ధిదారుల సంఖ్య 1,11,162 నుంచి 1,19,080కి చేరిందని గణాంకాలతో వివరించారు. ఇంకా 4,664 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa