ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్న కిషన్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 02:20 PM

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను తీసివేస్తే తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొలగిస్తే, తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలతో మాట్లాడతానని కిషన్ రెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్లతో ముస్లింలను ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించుకోవాలని సూచించారు. అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa