బీసీ రిజర్వేషన్లను పెంచే దిశగా తీసుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ఆమోదించకపోవడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా బాలసముద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని ఆమోదించలేదని విమర్శించారు. బీజేపీ రాజకీయ లబ్ధికోసమే బీసీలకు న్యాయం జరగకుండా అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టంగా పేర్కొన్నారు.
పొంగులేటి మరోవైపు గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వంపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. BRS హయాంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, వేలాది మంది లబ్ధిదారులు నిరాశ చెందారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే పేదలకు వాసతి కల్పించే లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరుగుతోందన్నారు.
అంతేకాకుండా, బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ వర్గాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బలమని, ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలు బీజేపీ కుటిలతను గుర్తించి రానున్న ఎన్నికల్లో సముచితంగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa