భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాటంలో ప్రాణాలు అర్పించిన పండగ సాయన్న జయంతిని శుక్రవారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కస్తూరి ప్రభాకర్, కోలా సైదులు, పెద్ది శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసంగిస్తూ, అట్టడుగు వర్గాల ప్రజల హక్కుల కోసం సాయన్న చేసిన త్యాగాలు ఎంతో ప్రేరణదాయకమని పేర్కొన్నారు. ఆయన చేసిన పోరాటం అనేకమందికి స్పూర్తిగా నిలుస్తోందని, సాయన్న ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు."సాగు చేసే వాడిదే భూమి" అన్న నినాదంతో ఉద్యమించిన పండగ సాయన్న, భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడి వీరమరణం పొందారని వారు గుర్తు చేశారు. ఆయన త్యాగాలు ఈనాటి యువతకు దిక్సూచి కావాలని, సామాజిక న్యాయం కోసం ఎదురెళ్లే ధైర్యం సాయన్న నుంచి నేర్చుకోవాలన్నారు.
సమాజంలో శ్రామికులకూ, రైతులకూ, అట్టడుగు వర్గాలకూ న్యాయం జరిగేలా చూడటమే పండగ సాయన్న పోరాటానికి నిజమైన నివాళి అవుతుందని నేతలు స్పష్టం చేశారు. ఈ తరహా పోరాట నాయకుల జయంతులను గుర్తుపెట్టుకోవడం ద్వారా యువతలో సామాజిక చైతన్యం పెరుగుతుందని, సమానత్వ సాధనకు ఇది స్ఫూర్తిదాయకం అవుతుందని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa