ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 12:58 PM

TG: హనుమకొండ రామ్‌నగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. వెంటనే 8 నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో కార్మికులు మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వారిని అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa