సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రైల్వేస్టేషన్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న లవరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7,70,000 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ల్యాబ్లో పనిచేస్తున్న లవరాజు బెట్టింగ్లకు బానిసై చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa