మల్లాపురం గ్రామంలోని గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మండపంలో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గణేశుడు విఘ్నాలు తొలగించే దేవత. ఆయన ఆశీస్సులతో మన నియోజకవర్గ ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు. వినాయకుని ఆరాధనతో ప్రారంభమైన కార్యాలు విజయవంతంగా ముగుస్తాయని ఆయన అన్నారు.
ఉత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణేశ మండపాన్ని అల్లీదిద్దిన తీరు స్థానికులను ఆకట్టుకుంది. గ్రామస్థుల సంఘీభావంతో నిర్వహించిన ఈ వేడుకలు హర్షాతిరేకాలు రేపాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు ఎల్లయ్య, ప్రతాప్ రెడ్డి, సతీష్ రెడ్డి, సత్తయ్య, జగన్, వెంకటరెడ్డి, లాలూ నాయక్, నారాయణ, రమేష్, ముత్యాలు, శివ తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో గ్రామాభివృద్ధి జరిగేందుకు అందరూ కృషి చేయాలని వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa