దసరాలోపు కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీల) నిర్మాణ పనులు ప్రారంభించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. నూతనంగా అమృత్- 2.0 పథకంలో భాగంగా నిర్మించే 39 ఎస్టీపీల నిర్మాణంపై గురువారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్ల వ్యయంతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చింది. రెండు ప్యాకేజీ - 2 కింద నిర్మించనున్న 39 ఎస్టీపీల పురోగతిని ఆయన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. భూవివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలని ఆయన ఆదేశించారు. భూవివాదాలు ఉన్న ప్రాంత స్థానిక కలెక్టర్ లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయమని ఎస్టేట్ ఆఫీసర్ కు సూచించారు. భూవివాదాలు ఉన్న ప్రాంత ఎస్టీపీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతంలో భూమిని గుర్తించాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అలాగే స్థలాభావం వద్ద తక్కువ స్థలంలో ఎక్కువ సామర్థ్యం నిర్మించే అవకాశాలను అవకాశాలను అధ్యనం చేసి దానికి సంబంధించిన టెక్నాలజీని అన్వేషించాలని అధికారులను ఎండీ కోరారు. పనులు మొదలు పెట్టిన మొదలు తుదివరకు ఎస్టీపీ ప్రాజెక్టు నిర్మాణం సంబంధించిన టైం లైన్లను నమోదు చేసి సమర్పించమని అధికారులను ఆదేశించారు. అలాగే వీలైనంత త్వరగా సాయిల్ టెస్టులను కూడా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు పద్మజ, సుజాత, వాస సత్యనారాయణ, ఈవో విజయ కుమారి, జీఎంలు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa