ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 05, 2025, 06:18 AM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 6న నగరానికి రావాల్సి ఉండగా, కొన్ని అత్యవసర కార్యక్రమాల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం.ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. ఇదివరకే అమిత్ షా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వెలువడినప్పటికీ, చివరి క్షణంలో ఈ మార్పు చోటుచేసుకుంది. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఇది నిరాశ కలిగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa