హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి ప్రాంతంలో భారీ ఎత్తున డ్రగ్స్ తయారీ జరుగుతోందని తెలుపుతూ, మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో రూ.12 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు మరియు 32,000 లీటర్ల రా మెటీరియల్ను స్వాధీనం చేశారు. ఇది ఇటీవల కాలంలో దేశంలో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద డ్రగ్స్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీని ఒక కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో నడుపుతూ, భారీగా ఎండీఎం ఎ డి (MDMA) లాంటి మాదకద్రవ్యాలను తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ను దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన యంత్రాలు, ల్యాబ్ పరికరాలు కనిపించాయి, ఇవన్నీ డ్రగ్స్ తయారీకి ఉపయోగపడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో డ్రగ్స్ తయారీదారులు, సరఫరాదారులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వీరి నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండడం, వివిధ రాష్ట్రాల నుండి ముడి సరుకులు సమకూర్చడం లాంటి వివరాలు బయటపడ్డాయి. ఇదంతా నిశిత దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చింది.
ఈ ముఠా గుట్టు బంగ్లాదేశ్కు చెందిన ఒక మహిళ అరెస్ట్తో వెలుగులోకి వచ్చింది. ఆమె వద్ద ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (Narcotics Control Bureau) కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడీ ఘటనపై కేంద్రం కూడా సీరియస్గా స్పందించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa