కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంస్థ ఇంచార్జీ కార్యదర్శి డా. సూర సుమలత ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి బ్యాంకు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఫాల్టు ఖాతాల పరిష్కారంపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ నెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో సాధ్యమైనంతమంది పౌరులు తమ కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని పొందేలా చేయాలని డా. సూర సుమలత సూచించారు. ముఖ్యంగా రూ. 50,000 నుంచి రూ. 1,00,000 లోపు ఉన్న డిఫాల్టు ఖాతాలను పరిష్కరించేందుకు బ్యాంకులు ఆసక్తి కనబరచాలని తెలిపారు.
లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులు, వాటి ప్రక్రియ, ప్రయోజనాలపై సమావేశంలో అధికారులకు వివరించారు. తక్కువ ఖర్చుతో, త్వరితగతిన వివాదాలను పరిష్కరించే అవకాశంగా లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో పలువురు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు తమ బ్యాంకుల వద్ద ఉన్న పెండింగ్ డిఫాల్టు ఖాతాల వివరాలను సమర్పించారు. వాటిని లోక్ అదాలత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa