ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ లోని 3వ డివిజన్ లో "శిల్పా ప్యారడైజ్ పార్క్" నందు నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి వేడుకల కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ఆ గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్య, విజయం, సంపద ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులతో ప్రజలకు సర్వశుభాలు చేకూరాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటరర్ లు రాఘవేంద్ర రావు, రవి కిరణ్, పెద్దిరెడ్డి సుజాత, నాయకులు సంబశివా రెడ్డి, స్వామి,ముత్యాలు, దివాకర్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి,మేకల మధుసూదన్ సంక్షేమ సంఘం నాయకులు ఏవీ.రెడ్డి, యాదగిరి గౌడ్, ప్రదీప్ రెడ్డి, నాగార్జున రెడ్డి, లలితా రెడ్డి, శ్రీకృష్ణ, అంజలి, శివా రెడ్డి, మహేష్ రెడ్డి, రుక్మానంద రెడ్డి, సతీష్, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa