ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీపై మోడీకి విజ్ఞప్తి చేసిన ప్రముఖ దర్శకుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 06:20 PM

జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. జీఎస్టీ సంస్కరణలు సరైన దిశగా అడుగులేనని పేర్కొన్న ఆయన.. మరింత మెరుగైన పరిష్కారాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. తాజా మార్పుల ప్రకారం.. రూ.100 లోపు సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ నిర్ణయం తక్కువ థియేటర్లకే వర్తించనున్నదని నాగ్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డారు. ‘రూ.100 లోపు టికెట్లతో పనిచేస్తున్న థియేటర్లు చాలా తక్కువ. ప్రజలకు నిజమైన లాభం చేకూరాలంటే, రూ.250 లోపు టికెట్లకూ 5 శాతం జీఎస్టీ వర్తింపజేయాలి’ అని ట్వీట్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa