ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్ల ధరలని తగ్గించిన రెనో ఇండియా సంస్థ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 06:28 PM

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా విభాగం శనివారం ఓ తీపి కబురు అందించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 విధానం వల్ల కలిగిన పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేస్తూ, తన కార్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ నిర్ణయంతో రెనో క్విడ్, ట్రైబర్, కైగర్ మోడళ్ల ధరలు రూ. 96,395 వరకు తగ్గాయి.ధరల తగ్గింపు తర్వాత, రెనో క్విడ్ ప్రారంభ ధర రూ. 4,29,900 (ఎక్స్-షోరూమ్) కాగా, కొత్త ట్రైబర్, కైగర్ మోడళ్ల ప్రారంభ ధరలు రూ. 5,76,300 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జరిగే డెలివరీలకు వర్తిస్తాయని, అయితే సవరించిన ధరలతో బుకింగ్‌లను తక్షణమే అన్ని రెనో డీలర్‌షిప్‌లలో ప్రారంభించినట్లు స్పష్టం చేసింది.ఈ సందర్భంగా రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె మాట్లాడుతూ, "జీఎస్టీ 2.0 ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు అందించడం మా నిబద్ధతకు నిదర్శనం. ఈ నిర్ణయం వల్ల మా కార్లు మరింత అందుబాటులోకి రావడమే కాకుండా, పండుగ సీజన్‌లో డిమాండ్‌ను కూడా పెంచుతుందని మేము విశ్వసిస్తున్నాం" అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa