ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయకుడి నిమజ్జనం వేళ భక్తులకు ఉచిత వైద్య సేవ‌లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 07:16 PM

వినాయక నిమ‌జ్జ‌న‌ వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఓ ఆస్పత్రి శుభవార్త చెప్పింది. వారికి ఉచిత సేవలు అందిస్తోంది. ఈ విషయం తెలిసి భక్తులు సంతోషపడుతున్నారు. మెడికవర్ ఆస్పత్రి సిబ్బంది భక్తులకు ఈ సౌకర్యం కల్పిస్తోంది. నిమిజ్జనానికి తరలి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నిమజ్జనం కోసం భారీగా భక్తులు తరలి వస్తోన్న నేపథ్యంలో వారిలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. వారికి తక్షణమే చికిత్స అందించేలా ఈ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అనుభవజ్ఞులైన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేక టీమ్‌గా నియమించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సర్వీసు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.


ఈ వైద్య బృందాలు.. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఆర్‌బీఎస్ (రాండమ్ బ్లడ్ షుగర్), బీపీ వంటి ప్రాథమిక పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారు. దీని వల్ల భక్తుల్లో అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి.. చికిత్స చేయడానికి అవకాశం కలుగుతుంది అంటున్నారు. భక్తులకు వైద్య సదుపాయాలు కల్పించడమే కాక వారి దాహం తీర్చేందుకు హస్పిటల్ యాజమాన్యం మంచి నీళ్ల బాటిళ్లను కూడా సరఫరా చేస్తుంది.


 ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి మేం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. నిమ‌జ్జ‌నానికి వచ్చే భక్తులందరికి మా వైద్య బృందం అండగా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తులకు వైద్య సేవలు అందిచండం సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు.


ఇక వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదాసీదాగా హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యక్షం కావడంతో భక్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. నిమజ్జనాలను పరిశీలించేందుకు వచ్చిన సీఎం రేవంత్.. భక్తులంతా క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. నిమజ్జనం ఏర్పాట్ల గురించి కలెక్టర్ హరి చందన ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అని విభాగాల సిబ్బందిని సీఎం ప్రశంసించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇలానే పని చేయాలని తెలిపారు. సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడంపై భాగ్యనగర్ ఉత్సవ్ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. భారీగా భక్తులు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌కు తరలి వస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా సందడిగా ఉంది. భక్తుల సౌకర్యార్థం మెట్రోను అర్థరాత్రి ఒంటి గంట వరకు నడుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa